PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ భవన నిర్మాణాలకు భూమిపూజ

1 min read

పల్లెవెలుగు వెబ్​, గడివేముల: మండలంలోని బిలకలగూడూర్, గడిగారేవుల గ్రామాల్లో వెల్ నెస్సెంటర్ ల బిల్డింగ్ కొరకు పీఆర్ ఎ ఈ. కె భాస్కర్ మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సింహా రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలోని 14 గ్రామ సచీవాలయా లు మంజూరు అయ్యాయని, వెల్నెస్ సెంటర్లు 8 మంజూరు కాగా 7 సెంటర్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు 14 మంజూరు కాగా 12 రైతు భరోసా కేంద్రాలు పనులు ప్రారంభం అయినట్లు మరియు బల్క్ మిల్క్ సెంటర్ లు 14 మంజూరు కాగా 7 సెంటర్లలో పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి ఈ వో ఆర్ డీ అబ్దుల్ ఖాలిక్ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లు హాజరయ్యారు.

About Author