PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిక్స్​డ్​ డిపాజిట్లకు.. అత్యధిక వడ్డీ ఏపీజీబీలోనే…

1 min read

– ఏపీజీబీ చైర్మన్​ రాకేష్​ కశ్యప్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఖాతాదారుల ఆలోచనకనుగుణంగా… ఫిక్సడ్​ డిపాజిట్లకు అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అని పేర్కొన్నారు ఏపీజీబీ చైర్మన్​ రాకేష్​ కశ్యప్​. ఏపీజీబీ కర్నూలు రీజనల్​ పరిధిలోని 12 శాఖలకు సంబంధించి ‘ ఎలైట్​ కస్టమర్స్​’ యొక్క మీటింగ్​ మంగళవారం అపోవ సదన్​లో జరిగింది. ఈ సందర్భంగా ఏపీజీబీ చైర్మన్​ రాకేష్​ కశ్యప్​ మాట్లాడుతూ డిపాజిట్ల సేకరణ మహోత్సవం సందర్భంగా ప్రగతి ధనలక్ష్మి అనే కొత్త పథకం ద్వారా 777 రోజుల కాల పరిమితికి 6.30 శాతం వడ్డీని సీనియర్​ సిటిజన్లకు మరియు 666 రోజుల కాల పరిమితికి 6.20 శాతం వడ్డీని సీనియర్​ సిటిజన్జలకు ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా హౌసింగ్​, గోల్డ్​, కారు… తదితర లోన్లను ఏపీజీబీలో పొందవచ్చని ఈ సందర్భంగా ఆ బ్యాంకు చైర్మన్​ రాకేష్​ కశ్యప్ స్పష్టం చేశారు.

అనంతరం ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయం మేనేజర్​ పి. ఓబయ్య మాట్లాడుతూ క్రాప్​, హౌసింగ్​ తదితర రుణాలను తక్కువ కాల పరిమితితోనే మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అపోవ ప్రెసిడెంట్​ యుగంధర్​, ప్రాంతీయ కార్యాలయం చీఫ్​ మేనేజర్​ భాస్కర్​ రెడ్డి, సీనియర్​ మేనేజర్స్​ మరియు వివిధ శాఖల మేనేజర్లు, వినియోగదారులు పాల్గొన్నారు.


About Author