PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం.. నిత్య అన్నదానానికి లక్ష విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: కర్నూలు జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణ రెడ్డి అనే భక్తుడు శ్రీశైలంలో జరిగే నిత్య అన్నదానానికి రూ.1,16,116 విరాళంగా అందజేశారు. సోమవారం నగదును శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్నకు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ లవన్న మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం దేవస్థానం అధికారులు భక్తుడు సూర్యనారాయణ రెడ్డికి స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

About Author