PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21న ఏపీ ఎడ్ సెట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ క‌ళాశాల‌ల్లో ప్రవేశాల‌కు నిర్వ‌హించే ఏపీ ఎడ్ సెట్ ప‌రీక్షను ఈనెల 21న నిర్వ‌ హించ‌నున్నారు. 21 వ తేది ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నట్టు సెట్ క‌న్వీన‌ర్ ఆచార్య కె. విశ్వేశ్వర‌రావు తెలిపారు. ప‌రీక్షకు 15,638 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. వీరికి 69 కేంద్రాల్లో ఆన్ లైన్ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ప‌రీక్ష స‌మ‌యానికి గంట ముందు ప‌రీక్షా కేంద్రంలోకి అభ్యర్థుల‌ను అనుమ‌తిస్తారు. ప‌రీక్ష స‌మ‌యం, తేది, ఇత‌ర వివ‌రాలు మొబైల్ నెంబ‌ర్ కు ఎస్ఎంఎస్ పంపిస్తామ‌ని సెట్ క‌న్వీన‌ర్ తెలిపారు. www.sche.ap.gov.in/edcet వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని ప‌రీక్షకు హాజ‌రు కావాల‌ని చెప్పారు.

About Author