NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడప నగరాన్ని స్పోర్ట్స్​ హబ్​గా తీర్చిదిద్దుతాము – మేయర్ సురేష్ బాబు

1 min read

​ DSA క్రీడా మైదానం పనులు పరిశీలించిన మేయర్​, అధికారులు

పల్లెవెలుగువెబ్​, కడప: కడప నగరాన్ని స్పోర్ట్స్ హబ్​గా తీర్చిదిద్దుతామని కడప మేయర్​, వైసీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు అన్నారు. శనివారం కడప నగరం dsa మైదానంలో చేపట్టిన నిర్మాణ పనులను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్​.అవినాష్​రెడ్డి సహకారంతో సొంత నిధులు వెచ్చించి మైదానం ఆధునికీకరణ పనులు చేపట్టామని తెలిపారు. క్రీడాకారులు, వాకర్స్​కు అనుకూలంగా ఉండేలా మైదానాన్ని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. అన్ని క్రీడలకు మైదానంలో చోటు కల్పించి క్రీడల కేంద్రంగా రూపు దిద్దుతామని తెలిపారు. రానున్న రోజుల్లో స్టేడియం ఆవరణంలో రెస్టారెంట్, స్పోర్ట్స్ మెటీరియల్ స్టోర్ ఏర్పాటు చేస్తామన్నారు. హాకీ అసోసియేషన్ సెక్రెటరీ సుభాన్ భాషా, వైస్సార్సీపీ కార్పోరేటర్లు, డివిజన్ ఇన్​ఛార్జులు, నాయకులు, అధికారులు సూర్యనారాయణ, రామలక్ష్మణ్​రెడ్డి, పత్తి రాజేశ్వరి, త్యాగరాజ, సింధు, బాషా మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

About Author