PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పకడ్బందీగా ‘ పరిషత్​’ ఎన్నికల ప్రక్రియ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్, కర్నూలు : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్​ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలోని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కర్నూలు కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కమాండ్​ కంట్రోల్​ రూం నుంచి కలెక్టర్​ పి. కోటేశ్వరరావు, ఎస్పీ సీహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి, జాయింట్​ కలెక్టర్​ (రెవెన్యూ) రాం సుందర్​ రెడ్డి, జాయింట్​ కలెక్టర్​ ( అభివద్ధి) సమూన్​, జేసీ (వెల్పేర్​)ఎంకేవీ శ్రీనివాసులు, జేసీ (హౌసింగ్​)నారపు రెడ్డి మౌర్య తదితరులు పరిశీలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని మండలాల ఎంపీటీసీ గెలుపోటములు ఖరారు అయ్యాయి.


About Author