PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూపీ రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్​! ఇద్దరు రైతులు మృతి

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: ఉత్తర్రపదేశలోని లకింపూర్​ఖేరి జిల్లాలో కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతోన్న రైతాంగ శిబిరంపైకి కేంద్రహోంశాఖ మంత్రి అజయ్​మిశ్రా వాహన కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. మరికొందరు రైతులు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన రైతులు మంత్రి కాన్వాయ్​లోని మూడువాహనాలను దగ్ధం చేశారు. లకింపూర్​ జిల్లాలో ఆదివారం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అజయ్​మిశ్రా, యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్​మౌర్యలు వచ్చారు. మంత్రుల పర్యటనను తెలుసుకున్న ఆందోళన రైతాలు వారి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో మంత్రుల కాన్వాయ్​ రైతుల మీదుకు దూసుకెళ్లడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

About Author