PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవినీతి రహిత పాలనే.. వైసీపీ ప్రభుత్వ లక్ష్యం

1 min read

– ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వాల్మీకినగర్​కు చెందిన ముగ్గురికి మంజూరైన పింఛన్లను ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి పంపిణీ చేశారు. కాలనీలోని బళ్లారి నాగేష్ , బోయ చంద్ర, విట్టల్ రావుకు కొత్త పింఛన్​ అందజేశారు. అలాగే ఎంఎం కాలనీ 18వ వార్డు చెందిన అర్చన ,రూపా, సరస్వతి, చింతలమ్మకు పట్టాలు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో టిడిపి జన్మభూమి కమిటీ ద్వారా పింఛన్లు, పట్టాలు, హౌసింగ్ లోన్ లు ఇలా అనేక వాటికి డబ్బు ఇవ్వనిదే ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అందేది కాదని, తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణఅధ్యక్షుడు దేవా, కౌన్సిలర్ చిన్న సుధాకర్, మల్లి వెల్ఫేర్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author