PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రాణదాతలకు… అభినందన

1 min read
రక్తదానం చేస్తున్న అభిమానులు

రక్తదానం చేస్తున్న అభిమానులు

పల్లెవెలుగు, కర్నూలు
అత్యవసర సమయంలో..రక్తదానం చేసే ప్రాణదాతలు.. దేవుళ్లతో సమానమని టైగర్​ టీం ఎన్టీఆర్​ మరియు ఎన్​కేఆర్​ అభిమాన సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు అభిప్రాయపడ్డారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు నిత్యం రక్తం అవసరమవుతుందని, ఈ విషయంలో సహాయం చేయాలని రెడ్​ క్రాస్​ సొసైటీ వారు తమను సంప్రదించడంతో… ఎన్టీఆర్​ మరియు ఎన్​కేఆర్​ అభిమానులతో రక్తదాన శిబిరంలో రక్తదానం చేయించారు. అనంతరం రెడ్​ క్రాస్​ సొసైటీ అధికారి, సెట్కూరు సీఈఓ నాగరాజు చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి ధ్రవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోడానికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. రక్తదానం చేసిన వారిలో టైగర్​ టీం, ఎన్టీఆర్​ మరియు ఎన్​కేఆర్​ అభిమానులు ఈరన్న, దుర్గన్న, జమ్మయ్య, సి. దుర్గన్న, చిన్న దుర్గన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో రెడ్​ క్రాస్​సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author