PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టాభి క్షమాపణ చెప్పాల్సిందే : ఎమ్మెల్సీ మయాన జాకీయా ఖానమ్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మీడియా ప్రతినిధి పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు ఎమ్మెల్సీ మయాన జాకీయా ఖానమ్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష, జెడ్.పి.టి.సి. వెంకటేశ్వర రెడ్డి, ఏ.పి.ఎం.ఐ.డి.సి. డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి. పట్టాభి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం రాయచోటి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం ఇంచార్జి మండల తహసీల్దార్ నరసింహా కుమార్ కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మయాన జాకీయా ఖానమ్ మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుందాతనం కోల్పోయి దిగజారుడు రాజకీయాలు చేస్తూ, తమ నాయకుల ద్వారా రెచ్చగొట్టేలా మాట్లాడిస్తుండడం బాధాకరమన్నారు.

కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి. నాయకులు హాబీబుల్లా ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ బాషా, జాకీర్, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి శ్యామ్, గౌస్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, అన్న సలీం, అల్తాఫ్, షబ్బీర్, జానం రవీంద్ర యాదవ్, రియాజ్,ఆనంద రెడ్డి, కూరగాయల మహబూబ్ బాష, రియాజుర్ రెహమాన్, గువ్వల బుజ్జిబాబు, మహేష్, జాఫర్ అలీఖాన్, కో-అప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి, ఖాదర్ వలీ, అమీర్, విక్కీ దేవేంద్ర, జావీద్, కొత్తిమీర ప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author