PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్టోబ‌ర్ 31న ఏపీ సెట్ పరీక్ష !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఈనెల 31న రాష్ట్ర స్థాయి అర్హత ప‌రీక్ష ఏపీసెట్ 2021 నిర్వహించ‌నున్నట్టు ఏపీసెట్ మెంబ‌ర్ సెక్రట‌రీ ఆచార్య కే. శ్రీనివాస‌రావు ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల ప‌రిధిలో 78 ప‌రీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామ‌న్నారు. 30 స‌బ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఏపీసెట్ కు 36,667 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప‌రీక్షా స‌మ‌యం ఉద‌యం 9:30 నిమిషాల నుంచి 12:30 నిమిషాల వ‌ర‌కు ఉంటుంది. గంట ముందుగా విద్యార్థుల‌ను ప‌రీక్షా కేంద్రంలోకి అన‌మతిస్తామ‌ని చెప్పారు. ప‌రీక్షా స‌మ‌యానికి ఒక్క నిమిషం ఆల‌స్యంగా వ‌చ్చినా అనుమ‌తించేదిలేద‌ని స్పష్టం చేశారు. విద్యార్థులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్పారు. వాట‌ర్ బాటిల్ వెంట తెచ్చుకోవ‌చ్చని తెలిపారు.

About Author