PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువత సినిమా రంగంలో రాణించాలి: టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: యువత ప్రతిభను బయటకు తీసి షార్ట్ ఫిలిం, సినిమా రంగాల్లో రాణించాలని టిజివి సంస్థల చైర్మన్ టి.జి భరత్ అన్నారు. మంగళవారం మౌర్య ఇన్‌లో ఆయ‌న ప‌జిల్ డెమో ఫిలింను లాంచ్ చేశారు. మ‌క్బుల్ డైరెక్షన్‌లో ప‌జిల్ అనే సినిమా తీయ‌నుండ‌గా.. డెమో ఫిలింను టి.జి భ‌ర‌త్ చేతుల మీదుగా లాంచింగ్ చేశారు. ఈ సంద‌ర్బంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ విభిన్న ఆలోచ‌న‌ల‌తో సినిమాలు తీయాల‌న్నారు. అప్పుడే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతార‌న్నారు. క‌ర్నూలు యువ‌తకు త‌మ స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మ‌క్బుల్‌, హీరోయిన్లు శృతి, రాణి, చిత్ర బృందం రామాంజ‌నేయులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author