PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తుంగాతీరంలో.. బ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వన భోజన ఆహ్వాన పత్రిక ను  గురువారం సంకల్ భాగ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయం లో  బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర రావుబ్రాహ్మణ సంఘం ముఖ్య సలహదారులు H. K. మనోహర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఈ నెల 28 వ తేదీ పవిత్ర తుంగభద్ర నది తీరం లో కళ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక వన భోజనాలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని,  కర్నూలు నగరం లో వుండే బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ వన భోజనం కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

.ఉదయం 5 -30 గంటలకు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామికి మరియు భవాని సహిత రామలింగేశ్వర స్వామీ వారికి అభిషేకం, విశేష పూజలు మరియు 9 -30 నిమిషాలకు ధాత్రి పూజ, పిల్లకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యమాలు అనంతరం విశిష్ట అతిధులకు సన్మానం, పిల్లలకు బహుమతి ప్రదానం, అనంతరం భోజన కార్యక్రమం జరుగును. అని తెలిపనారు. ఈ కార్యక్రమం లో బ్రాహ్మణ సంఘం సభ్యులుకె. జి. ప్రభాకర రావు ,  పద్మనాభ రావు, సుబ్రమణ్యం శాస్త్రి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About Author