PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉదారతను చాటిన స్నేహబంధం

1 min read
  • స్నేహితుని కుటుంబానికి  1.35 లక్షల ఆర్థిక సహాయం

పల్లెవెలుగు వెబ్​, గడివేముల:   ఆప్తమిత్రుడు.. 10వ తరగతి బ్యాచ్​కు చెందిన స్నేహితుడు… అనారోగ్యంతో మృతి చెందితే.. సదరు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు తోటి మిత్రులు. ఈ ఘటన గడివేముల మండలం బూజునూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.   బూజునురు గ్రామానికి చెందిన కరిముల్లా నవంబర్ 22న అనారోగ్యంతో  మృతి చెందాడు.  కరిముల్లాకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.  గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 2000 సంవత్సరం బ్యాచ్‌ లో చదువుకున్న తోటి స్నేహితులు విషయం తెలుసుకొని ఆదివారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబ పరిస్థితులు తెలుసుకుని వారి వంతుగా రూ.1లక్ష 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే మృతుడి కూతురు పెళ్లికి కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తామని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. కరిముల్లాతో కలిసి చదువుకున్న గడివేముల పూర్వ విద్యార్థులు, రమణ రెడ్డి ఇబ్రహీం మనోహర్ సుధాకర్ అల్లి భాష లతో పాటు మొత్తం 30మంది కలిసి గ్రామానికి వచ్చి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారిలో ఒకరైన సహ విద్యార్థి రామ్మోహన్ ఏకంగా కరిముల్లా కూతురు వివాహానికి ఖర్చు భరిస్తామని అన్నారు  ఆపదలో ఉన్న కుటుంబానికి స్నేహితులు ఆసరాగా నిలిచిన తీరుపై పలువురు అభినందించారు.

About Author