PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థియేట‌ర్ పై దాడి.. ర‌చ్చ చేసిన `పుష్ప‌` ఫ్యాన్స్ !

1 min read
                                           

ప‌ల్లెవెలుగువెబ్ : అల్లుఅర్జున్ న‌టించిన పుష్ప సినిమా బెనిఫిట్ షో వేయ‌లేద‌ని అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. థియేట‌ర్ పై దాడి చేశారు. ఏపీలో ఇటీవల బెనిఫిట్‌ షోలు రద్దు చేస్తూ జీవో పాస్‌ చేసింది. ఈ క్రమంలో ఈ రోజు పుష్ప రిలీజ్‌ సందర్భంగా ఏపీలో బెనిఫిట్‌ షోలు వేస్తారని ఫ్యాన్స్‌ అంతా ఆశించారు. అయితే అనంతపురం జిల్లా హిందూపురం బాలాజీ థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్‌ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. చివ‌రికి బెనిఫిట్‌ షో వేయకుండ ఫ్యాన్స్‌కు మొండిచేయి చూపించింది. దీంతో డబ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన అభిమానులు థియేటర్‌పై రాళ్లు విసరి అద్దాలు పగలగొట్టారు. ఇక థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, థియేటర్‌ను క్లోజ్ చేశారు.

           

About Author