PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`పుష్ప‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా.. షాక్ అవుతారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎర్ర‌చంద‌నం నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం పుష్ప‌. సినిమా ఈనెల 17న విడుద‌లైంది. విడుదలైన రోజు నుంచి సెన్సేష‌న్ సృష్టిస్తోంది. సినిమా విడుదల రోజు భారీ ఓపెనింగ్స్‌తో ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారని మైత్రీ నిర్మాతలు తెలిపారు. ‘పుష్ప: ది రైజ్‌’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్‌ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్‌ వద్ద బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందని మేకర్స్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నైజామ్‌ ఏరియాలో దాదాపు 11.5 కోట్లు షేర్‌ కలెక్ట్‌ చేసి, ఆ ఏరియాలోనే విడుదలైన తొలిరోజునే అత్యధిక వసూళ్ల రాబట్టిన సినిమాగా పుష్ప ది రైజ్‌ సరికొత్త రికార్డు అందుకుంది.

                          
                         

About Author