PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌మ్యూనిస్టులు మొరిగే కుక్క‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు క‌మ్యూనిస్టుల పై తీవ్రప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. కమ్యూనిస్టులు మొరిగే కుక్కలంటూ ధ్వజమెత్తారు. తమకు అధికారమిస్తే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ రూ.70కి.. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు జగన్‌ పేరు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ప్రజా ఆగ్రహ సభలో ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు నీచులని, యూనియన్లతో వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. బీజేపీకి అధికారమిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని, పాలనపై అవగాహన ఉన్న వ్యక్తిని సీఎం చేస్తామని మాటిచ్చారు.

                              

About Author