PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కబ్జాదారుల నుండి చెరువు కట్టను కాపాడండి

1 min read

పల్లెవెలుగు వెబ్, పత్తికొండ​: పత్తికొండ చెరువు కట్ట స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడాలని గురువారం ముస్లిం కాలనీవాసులు రెవెన్యూ అధికారులకు విజ్ఞాపన పత్రం అందజేశారు. షాదీఖానా పక్కలో కొంతమంది రియల్ వ్యాపారులు చెరువు కట్ట స్థలాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఈ స్థలాల్లో మట్టిని తవ్వి అడ్డంగా బండలు పాతారు అని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా స్థలాల్లో తాత్కాలికంగా దిబ్బలు వేసుకొని వినియోగించుకుంటున్న మని, అయితే మమ్ములను కాదని స్థలాలను రియల్టర్ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్ బారినుండి తమ అనుభవంలో ఉన్న చెరువు కట్ట స్థలాలను కాపాడాలని బాధితులు రెవెన్యూ అధికారి విష్ణు కుమార్ ను కోరారు. ఈ మేరకు బాధితులు మీరా హుస్సేన్, ఇబ్రహీం, మహమ్మద్ భాష, బడేసాహెబ్, నబి సాహెబ్ తదితరులు రెవెన్యూ అధికారులను కలిశారు.

About Author