PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

22 మంది స‌జీవ స‌మాధి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ లో ఘోరం జ‌రిగింది. భారీగా కురుస్తున్న మంచు దెబ్బ‌కు 22 మంది స‌జీవ స‌మాధి అయ్యారు. ఉష్ణోగ్ర‌త మైనస్ 8 డిగ్రీల‌కు ప‌డిపోవ‌డంతో ఒకే కుటుంబంలోని 8 మందితో పాటు 10 మంది చిన్నారులు స‌హా మొత్తం 22 మంది స‌జీవ స‌మాధి అయ్యారు. ఇస్లామాబాద్‌కు స‌మీపంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం ముర్రీకి పోటెత్తడంతో శుక్రవారం రాత్రి వేలాదిగా వాహనాలు ఆ దారిలో చిక్కుకుపోయాయి. తీవ్రంగా మంచు కురుస్తుండటం, ఉష్ణోగ్రతలు మైన‌స్ 8 డిగ్రీలకు పడిపోవడంతో చాలా మంది ఎటూ కదల్లేక వాహనాల్లోనే ఉండిపోయారు.

                                           

About Author