PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం అభ్య‌ర్థి ఎంపిక‌.. ప్ర‌జ‌ల నిర్ణ‌యానికే .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జాభిప్రాయం మేర‌కే పంజాబ్ సీఎంను ప్ర‌క‌టిస్తామ‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్‌ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థి ఎంపికకు పంజాబ్‌ ప్రజలు తమ ఎంపికను తెలియజేయడానికి కాల్‌/ మెసేజ్‌ లేదా వాట్సాప్‌ చేయాలని అన్నారు. పంజాబ్ సీఎం ఎంపిక పై కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణ‌యం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది.

                                        

About Author