PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 మంది వైద్య విద్యార్థులకు కరోన !

1 min read

పల్లెవెలుగువెబ్ : కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రేపు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. రేపు 150 మంది వైద్య విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 50 మంది వైద్య విద్యార్థులు కరోన బారినపడగా.. మరికొంత మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపటి పరీక్షలు వాయిదా వేయాలని వైద్య కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ యూనివర్శిటీని కోరింది. రేపు ఫైనల్ పరీక్షలు జరగనుండగా కరోన కలకలం రేగడంతో వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

              

About Author