PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జేఎన్ యూ విద్యార్థి పై దేశద్రోహం కేసు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్ పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన నేపథ్యంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చేపట్టిన ఓ కార్యక్రమంలో ఇమామ్ అభ్యంతరకర, విధ్వేష ప్రసంగాలు చేశాడని రుజువైనట్లు కోర్టు పేర్కొంది. ఈ విషయమై వాదనలు విన్న అడిషనల్ సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇమామ్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఏ (దేశద్రోహం), సెక్షన్ 153ఏ, సెక్షన్ 153బీ , సెక్షన్ 505 .. వీటితో పాటు ఉపా చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

         

About Author