PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేలుడు పదార్థంతో సీఎంకు బెదిరింపు లేఖ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ కు బెదిరింపు లేఖతో కూడిన పేలుడు పదార్థం పంపిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా పట్టణంలో టైమరుతో కూడిన పేలుడు పదార్థాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఘటనా స్థలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బెదిరిస్తూ లేఖ లభించింది. జాతీయ రహదారి-30పై వంతెన కింద బెదిరింపు లేఖతో పేలుడు పరికరాన్ని పోలీసులు గుర్తించారు. పరికరం లభ్యమైన వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుంది.మధ్యప్రదేశ్‌లోని రేవా డివిజన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.ఈ బెదిరింపు లేఖ, పేలుడు పదార్థం లభ్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

          

About Author