PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరీక్షా ఫలితాల పై నిరసన.. రైలుకు నిప్పు !

1 min read

పల్లెవెలుగువెబ్ : రైల్వే పరీక్ష ఫలితాల పై బీహార్ లో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు నాన్​టెక్నికల్​ పాపులర్ సీబీటీ-1 ​పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్​ను విడుదల చేసింది. సదరు నోటిఫికేషన్​లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. కాగా, మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్​ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు స్పష్టం చేసింది. రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్​ చేరుకున్నారు. ఆతర్వాత ఆగి ఉన్న ప్యాసింజర్​ రైలుకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు.

        

About Author