PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా చేతికి ఎయిర్ ఇండియా !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా టాటాల చేతికి చేరింది. ఎయిరిండియా యాజమాన్య హక్కులను అధికారికంగా టాటా గ్రూప్ కు గురువారం కేంద్రం బదలాయించింది. టాటా అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అధికారికంగా ఎయిరిండియాను అప్పగించినట్టు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే గురువారం మీడియాకు తెలిపారు. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని చెప్పారు. ఎయిరిండియా అప్పగింత పట్ల రతన్ టాటా కూడ సంతోషం వ్యక్తం చేశారు.

           

About Author