PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహా ర్యాలీని విజయవంతం చెద్దాం: ఎంపీపీ రాజేంద్రనాథ్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి/వీరబల్లి: సుండుపల్లె మండలంలో జె.ఏ.సి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీన జరిగే మహార్యాలీలో వీరబల్లె మండలం నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొని మహార్యాలీని విజయవంతం చేద్దామని  వీరబల్లి మండల అధ్యక్షుడు గాలివీటి. రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి  వీరబల్లి, సుండుపల్లి మండలాలను రాజంపేట నియోజకవర్గంలో లో  ఉండగా కనీసం బస్సు సౌకార్యానికి కూడా  నోచుకోలేని విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా వీరబల్లి, సుండుపల్లి మండలాలను రాయచోటిలో కలిపినట్లయితే రెండు మండలాల ప్రజలు ఎంతో ఆనందిస్తారని తెలిపారు. ముఖ్యంగా వీరబల్లి, సుండుపల్లి మండలాలకు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటిలో కలిపినట్లయితే ప్రజలు తమ అవసరాల నిమిత్తం జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందన్నారు. అందుకోసం ఫిబ్రవరి 4 వ తేదీన సుండుపల్లి మండలం నందు సుండుపల్లి జె.ఏ.సి కన్వీనర్  విశ్వనాధ నాయక్, గౌరవ సలహాదారుడు బెల్లం సంజీవ రెడ్డి, జె.ఏ.సి నాయకుడు పల్లం చందు, వెంకటేశ్ లు తలపెట్టిన మహా ర్యాలీ కి మన  వీరబల్లె మండలం నుండి ప్రజలు ప్రతిఒక్కరూ వచ్చి మహా ర్యాలీ ని విజయవంతం చేయాలనిఆయనపిలుపునిచ్చారు., ఈ కార్యక్రమంలో వీరబల్లి వైసిపి మండల నాయకులు గాలివీటి.వీర నాగిరెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author