PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసదుద్దీన్ కు జడ్ కేటగిరి భద్రత !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. తక్షణమే సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది. జడ్ కేటగిరి కింద 22 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసు సిబ్బంది ఉంటారు. నిన్న యూపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓవైసీ కారు పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన వ్యక్తుల్లో ఒకరిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.

        

About Author