PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 వైభవం.. విగ్రహప్రతిష్టాపనోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని బండిమెట్టలో నూతనంగా నిర్మించిన గంగా భవాని ఆలయం, శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కర్నూల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టిజి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఆ తరువాత పాతబస్టాండ్​లో ఉన్న శ్రీశైల దేవస్థాన సత్రములో శివ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివస్వాముల అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.  శివ స్వాముల కోసం ఉచితంగా అన్నదానం చేయడం సంతోషించదగ్గ విషయమని భరత్ అన్నారు. కార్యక్రమంలో శివస్వాములు పాల్గొన్నారు.

About Author