PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

459 మంది మృతి.. ఒక్క రోజే ఇంత మంది?

1 min read

ఢిల్లీ: క‌రోన క‌రాళ నృత్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా విలళయ‌తాండ‌వం చేస్తోంది. రోజు రోజుకీ మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క రోజులోనే 459 మంది క‌రోనాకు బ‌లికావ‌డం.. ప్రమాద ఘంటిక మోగిస్తోంది. 11,25,686 మందికి బుధ‌వారం ప‌రీక్షలు నిర్వహించ‌గా..72,330 మందికి పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రక‌టించింది. ఇప్పటికే 1,62,967 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజు రోజుకీ క్రియాశీల కేసులు పెర‌గ‌డం.. ఆందోళ‌న క‌లిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమ‌త్తమ‌య్యాయి. కోవిడ్ నియంత్రణ‌లో భాగంగా క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమలు చేస్తున్నాయి.

About Author