PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు జిల్లాలో అక్ర‌మ రేష‌న్ బియ్యం ప‌ట్టివేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని మద్దూరు గ్రామం నుంచి కడప జిల్లా వైపు అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ రమణయ్య తెలిపారు. మద్దూరు మెట్ట సమీపంలో బోలేరో వాహనంలో రేషన్‌ బియ్యం తరలిస్తుండగా తనిఖీ చేసి అందులో 13 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నామని అన్నారు. దువ్వూరు మండలం కానగూడురు గ్రామానికి చెందిన సుధాకర్‌, పెద్దబాకరపేటకు చెందిన మహేంద్రారెడ్డిలను అదుపులోకి తీసుకొని పట్టుబడిన వాహనాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

                                    

About Author