NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అడుగంటిన శ్రీశైలం.. ఆందోళ‌న‌లో రైత‌న్న‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీశైలం జలాశయంలో నీరు అడుగంటిపోతున్నాయి. జలాశయం నీటిమట్టం 804 అడుగులకు పడిపోయింది. పాతాళగంగలో చివరిమెట్ల దారి దిగువకు నీరు చేరాయి. నీరు అడుగంటిపోవడంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుణ్య స్నానాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 804 అడుగులకు చేరడంతో హంద్రీనీవా కాలువకు నీటిని నిలిపివేశారు. ఈ క్రమంలో హంద్రీనీవా కాలువ కింద రబీలో వేసిన పంటలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగునీటి కోసం రైతులు ఆందోళన బాట పడుతున్నారు.

                                   

About Author