PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ప్రభుత్వం తీరు చూస్తే బెండు అప్పారావు సినిమా గుర్తొస్తుంది !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వ తీరు పై మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. అడ్డగోలుగా అప్పులు చేసి ప్రజలకు పంచుతామనే విధానానికి చరమగీతం పాడాలని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే విచ్చలవిడితనాన్ని కట్టడి చేయగలమని అభిప్రాయపడ్డారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

              

About Author