PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాలలో అల్లర్లు సృష్టిస్తే చర్యలు: ఎస్ఐ మల్లికార్జున

1 min read

పల్లెవెలుగు వెబ్, ఓర్వకల్: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ, ఉప్పలపాడు, హుసేనాపురం, కాల్వ గ్రామాలలో   ఎస్​ఐ మల్లికార్జున సిబ్బందితో కలిసి పర్యటించారు. కర్నూలు రూరల్​ సీఐ శ్రీనాథ్​ రెడ్డి  ఆదేశాల మేరకు  ఆదివారం పర్యటించిన  ఎస్​ఐ ..  ఆయా గ్రామాల  ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజు రాత్రి  జాగరణ సందర్భంగా గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన , మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన, తాగి  అల్లర్లు చేసిన అటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకొని కేసులు  నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ మల్లికార్జునతో పాటు ఓర్వకల్లు పోలీసులు  వీరా రెడ్డి, బలరాం మరియు రాఘవేంద్ర లు పాల్గొన్నారు.

About Author