NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ ఎంపీని త‌క్ష‌ణం ప్ర‌శ్నించండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులు అన్నారు. మెజార్టీ సాక్ష్యాలు అవినాష్ రెడ్డిని దోషిగా నిలబెడుతూ ఉన్నాయని తెలిపారు. అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్మోహన్‌ రెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య లో ప్రధాన కుట్రదారు, సూత్రధారి అవినాష్ రెడ్డి అని అన్నారు. 40 కోట్ల సుపారీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడిని హత్య చేసేందుకు కుటుంబసభ్యులు కుట్ర చేశారు అంటే దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉందో బయటకు రావాలని అన్నారు. అవినాష్‌రెడ్డిని తక్షణం ప్రశ్నించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

                                     

About Author