PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ‌లో రేవంత్ వ్యాఖ్య‌లు.. బీహార్ లో ఆగ్ర‌హం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది ‘బిహార్‌ డీఎన్‌ఏ’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలతో బిహార్‌లో ఆ పార్టీ పై ఎన్డీఏ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. బిహార్‌ ముఠా తెలంగాణను ఆక్రమిస్తోందని, రాష్ట్రంలోని కీలకమైన శాఖలన్నిటినీ బిహార్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులకు అప్పగించడమేకాకుండా కేసీఆర్‌కు సలహాలు ఇవ్వడానికి కొత్తగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను కూడా అక్కడ నుంచే తీసుకువచ్చారని రేవంత్‌ విమర్శించారు. ఈ నేప‌థ్యంలో బీహార్ లోని జేడీయూ,బీజేపీ కూట‌మి రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఖండించింది.

                               

About Author