PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివేకాను ఎవ‌రో చంపితే.. మీరెందుకు ర‌క్తపు మ‌ర‌కలు తుడిచారు ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డిని చూస్తుంటే తనకు బాధేస్తోందన్నారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. వివేకను ఎవరో చంపితే మీరెందుకు రక్తం తుడిచారని, గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించారు. పారదర్శకంగా జరుగుతున్న వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు. మునిసిపాలిటీ మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసే డ్యూటీ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం సరికాదని రాఘురామ అన్నారు. తనను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసేందుకు.. సీఎం జగన్ తెలంగాణలో ఉన్న ఏ పోలీస్ అధికారితో మాట్లాడారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎవరితో మాట్లాడారో తనకు ఐడియా ఉందన్నారు.

                                        

About Author