PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రిట‌న్ యువ‌తిని నెల్లూరు అడ‌విలో వ‌దిలేశారు.. ఏం జ‌రిగిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ్రిటన్ దేశానికి చెందిన 25 ఏళ్ల విదేశీ యువతిని రాపూరు రోడ్డు అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయారు. లోదుస్తులతో ఉన్న ఆమె సాయం కోసం కేకలు వేయడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఆమెను సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పోలీసుల సంరక్షణలో ఉంది. ఆమెపై అత్యాచారయత్నం జరిగి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాల కోసం రాపూరు అటవీ ప్రాంతాన్ని గాలిస్తున్నారు.

                                      

About Author