PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ అయిన సీఎం కేసీఆర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడ్నుంచి ప్రగతిభవన్‌కు సీఎం బయల్దేరారు. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌కు వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. అయితే ఆయనకు ఎలాంటి సమస్యల్లేవని.. అంతా బాగుందని వైద్యులు స్పష్టం చేశారు. కరోనరి యాంజియోగ్రామ్‌ మొదలుకుని ఈసీజీ, టూడీ ఈకో, మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ ఇలా కేసీఆర్‌కు వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం వైద్య బృందం మీడియా మీట్ నిర్వహించి వివరాలు కూడా వెల్లడించారు.

                                      

About Author