PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో 42 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. నంద్యాల పట్టణం విశ్వనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం మెనూలో పొంగలి, సాంబారు, కోడిగుడ్లను 91 మంది విద్యార్థులు తిన్నారు. కాసేపటికే విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో స్థానికులు 42 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్స అందించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోడిగుడ్లు మూడు వారాల క్రితం పాఠశాలకు సరఫరా అయ్యాయని, ఎండాకాలం కావడంతో లోపల పాడై ఉండవచ్చని భావిస్తున్నారు. పొంగలి, సాంబారు, కోడిగుడ్లను పరిశీలించేందుకు కర్నూలులోని ల్యాబ్‌కు పంపారు.

                                               

About Author