PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ ష‌ర్మిల భ‌ర్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తున్నారు. వివిధ మిషనరీ సంస్థలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, వివిధ సంఘాల నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనిల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పార్టీ పెట్టమని అన్నిసంఘాలవాళ్లు కోరుతున్నారని, దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. పార్టీ పెట్టడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, చాలా సీరియస్‌ వర్క్‌ చేయాలని అన్నారు. ఈ సంఘాల వాళ్లంతా తన కోసం పనిచేశారని, తాను వాళ్ల మాట వినాల్సిందేనన్నారు. ఎవరి సాయం లేకుండా ఎవరూ పదవుల్లోకి రాలేరన్నారు. ప్రజలంతా పాలించమని నాయకులకు ఉద్యోగాలు ఇచ్చారని బ్రదర్ అనిల్ వ్యాఖ్యానించారు.

                                           

About Author