PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాలూ పార్టీలో శ‌ర‌ద్ యాద‌వ్ పార్టీ విలీనం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీహార్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీలో లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జేడీ) పార్టీ విలీనమైంది. సీనియర్ సోషలిస్ట్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తన సొంత పార్టీ అయిన ఎల్‌జేడీని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీలో ఆదివారంనాడు విలీనం చేశారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ, విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేసినట్టు చెప్పారు. బీజేపీని ఓడిపించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఇదేనని అన్నారు. ప్రస్తుతం, యూనిఫికేషన్ అనేదే తమ ప్రాధాన్యతాక్రమమని, ఐక్య విపక్షానికి ఎవరు సారథ్యం వహించాలనేది తర్వాత ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

                                                      

About Author