PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర విమాన ప్ర‌మాదం.. 133 మంది ప్ర‌యాణీకులు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం కూలిపోయింది. నైరుతి చైనాలోని వూహో సిటీ సమీపంలోని పర్వతశ్రేణుల్లో సోమవారం విమానం కూలిపోయింది. చైనాలోని కున్మింగ్ నుంచి గ్వాంగో సిటీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.11 నిమిషాలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానానికి సంబంధించి 2.22 నిమిషాలకి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమాన ప్రమాదం జరిగిన పర్వత ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టింది. అయితే, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

                                         

About Author