PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ ఫైల్స్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘కాశ్మీర్ ఫైల్స్‌’లాగా త్వరలోనే ‘హైదరాబాద్ ఫైల్స్’ కూడా వస్తుందని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని మురళీ మండిపడ్డారు. దీనికి టీఆర్ఎస్, పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో లవ్ జిహాద్ కేసులలో పురోగతి లేదన్నారు. బోధన్‌లో హిందులను అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా? లేదా పాకిస్థాన్‌లో ఉందా?.. అంటూ ఈ సందర్భంగా బీజేపీ నేత ప్రశ్నించారు.

                                           

About Author