PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగి కేబినెట్లో ఒకే ఒక్క ముస్లిం మంత్రి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య‌నాథ్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో ఒకే ఒక్క ముస్లిం నేతకు చోటు దక్కింది. ఆయన పేరు డానిష్ అజాద్ అన్సారి. యోగి ఆదిత్యనాథ్ గత ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మొహిసిన్ రజా స్థానంలో ఈసారి అన్సారికి చోటు కల్పించారు. సహాయ మంత్రిగా అన్సారీ ప్రమాణస్వీకారం చేశారు. బల్లియాకు చెందిన 32 ఏళ్ల డేనిష్ అజాద్ అన్సారీ లక్నో యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. యూనివర్శిటీ విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఆయన ఏబీవీపీలో చేరారు. 2018 అక్టోబర్‌లో యోగి ప్రభుత్వం ఆయనను ఉర్దూ భాషా కమిటీకి అన్సారీని నామినేట్ చేసింది. ఇది మంత్రి హోదా కలిగిన పదవి. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మందు బీజేపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా అన్సారీని బీజేపీ నియమించింది.

                                         

About Author