PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీని అంత‌మొందిస్తాం.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఓ మెయిల్ వచ్చింది. ఆయన హత్యకు 20 స్లీపర్‌ సెల్స్‌ సిద్ధంగా ఉన్నాయని గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఎన్‌ఐఏ సహా తదితర కేంద్ర సంస్థలకు ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. అంతేకాకుండా దేశంలోని 20 ప్రాంతాల్లో 20 కిలోల ఆర్డీఎక్స్‌ అమర్చామని, వేల మందిని చంపి దేశానికి తీరని దుఖం మిగుల్చుతామని ఆ వ్యక్తి తన మెయిల్‌లో బెదిరించాడు. ‘‘సాధ్యమైనంత త్వరగా మోదీని హత్య చేయడమే మా లక్ష్యం. అలాగే దేశవ్యాప్తంగా వేల మందిని చంపి బీభత్సం సృష్టిస్తాం. ఆ పని చేయగల స్లీపర్‌ సెల్స్‌ నా వద్ద ఉన్నారు. ఫిబ్రవరి 28న ఆ స్లీపర్‌ సెల్స్‌ను క్రియాశీలం చేశాను. త్వరలోనే కార్యాచరణ మొదలుపెడతాం’’ అని ఆ దుండగుడు బెదిరించాడు. దీంతో కేంద్ర సంస్థల అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

                              

About Author