PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌న్న కొడుకుని స్తంభానికి క‌ట్టి .. క‌ళ్ల‌ల్లోకి కారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన 15 ఏళ్ళ కొడుక్కి తల్లి ఘాటు ట్రీట్‌మెంట్‌ ఇ‍చ్చింది. కొడుకుని స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం పోసి చితకబాదింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన బాలుడు గత రెండు సంవత్సరాలుగా గంజాయికి బానిసయ్యాడు. తల్లి పలుమార్లు నచ్చజెప్పినా కుమారుడి తీరు మారలేదు. దీంతో మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాట వినకపోవడంతో విసిగెత్తిన తల్లి కొడుకుని వీధుల్లోకి లాక్కొచ్చి విద్యుత్‌ స్తంభానికి కట్టేసింది. గంజాయి మత్తుతో చిత్తయిపోతున్న కొడకు కళ్లల్లో కారం కొట్టి దేహశుద్ధి చేసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

                                                

About Author