PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. ఓ దొంగ‌ల ముఠా : జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం జ‌గ‌న్ ..టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఓ దొంగల ముఠా అని, ఆ దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని, గతంలో ఏపీని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తనకు క్లాస్‌ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, తాను మోదీ మాత్రమే ఆ రూమ్‌లో ఉన్నామని, వీళ్లు రూమ్‌లో సోఫా కింద ఉండి విన్నారా? అని ప్రశ్నించారు. మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా దొంగల ముఠానే అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

                                      

About Author