PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు.. డ్ర‌మ్ములో మృత‌దేహం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. డ్రమ్ములో మృతదేహం ఉంచి వాసన రాకుండా సిమెంట్ కంకరతో దుండగులు ప్లాస్టింగ్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

                                  

About Author