PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అతడికి.. వితంతువు పింఛన్​

1 min read

– వాలంటీర్​ తొలగింపు.. వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: డోన్​ మండలం ఎద్దుపెంట గ్రామంలో పురషుడికి వితంతువు పింఛన్​ పంపిణీ విషయంలో కలెక్టర్​ జి. వీరపాండియన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వాలంటీర్​ను తొలగించి.. వెల్ఫేర్​ అసిస్టెంట్​ను సస్పెండ్​ చేశారు. వివరాలిలా ఉన్నాయి.ఎద్దుపెంట గ్రామానికి చెందిన హరిజన కాశీం 2009 ఫిబ్రవరి నుంచి అప్పటి పంచాయతీ సెక్రటరి ద్వారా పించన్​ మంజూరు చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వితంతువు పింఛన్​ పొందుతూనే ఉన్నాడు. ఈనెల 8న ‘ అతడికి వితంతువు పింఛన్​’ శీర్షికతో పల్లెవెలుగు వెబ్​ మీడియాలో ప్రచురితమైన విషయం విధితమే. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన వైకేపీ డీఆర్​డీఏ శ్రీనివాసులు.. వాలంటీర్​ సువర్ణకు సదరు వ్యక్తి చిన్నాన్న కావడంతో, బంధుప్రీతితో పింఛన్​ కొనసాగిస్తూ.. సిఫారస్​ చేసినట్లు తేలింది. అంతేకాక ఎద్దుపెంట వెల్ఫేర్ అసిస్టెంట్ సుభాషిణి నిర్లక్ష్య ధోరణితో పరిశీలించకుండా పై అధికారులకు సిఫారసు చేసినట్లు స్పష్టమైంది. నివేదికను డీఆర్​డీఏ పీడీ శ్రీనివాసులు కలెక్టర్​కు సమర్పించిన వెంటనే..వాలంటీర్​ సువర్ణను, వెల్ఫేర్​ అసిస్టెంట్​ సుభాషిణినిసస్పెండ్​ చేస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు.

About Author