PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ కు షాక్: భ‌ద్రతా సిబ్బందికి క‌రోన పాజిటివ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. వైద్యుల సూచ‌న మేర‌కు కొన్ని రోజుల‌పాటు క్వారంటైన్లో ఉంటారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ ప‌త్రిక ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ప‌వ‌న్ భద్రతాసిబ్బంది ఒక్కొక్కరుగా.. క‌రోన బారిన‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నార‌ని జ‌న‌సేన పార్టీ ప్రతినిధులు తెలిపారు. వీరంతా కూడ ప‌వ‌న్ కు చాలా స‌న్నిహితంగా విధులు నిర్వర్తిస్తారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ను ఐసోలేష‌న్లో ఉండాల‌ని వైద్యులు సూచించారు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి. హోం క్వారంటైన్లో ఉంటూ .. పార్టీ కార్యక్రమాల‌ను ప‌ర్యవేక్షిస్తార‌ని జ‌న‌సేన పార్టీ ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది.

About Author